గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు గడువు పెంచాలంటూ.. వినతి పత్రం

Update: 2023-08-10 10:16 GMT

దిశ, చిలుకూరు: గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు గడువు పెంచాలంటూ సీపీఐ మండల శాఖ ఆధ్వర్యంలో బుధవారం డిప్యూటీ తహశీల్దార్ కరుణశ్రీకి వినతి పత్రం అందించారు. దరఖాస్తుకు మూడు రోజులే గడువు ఇవ్వడం.. సంబంధిత సర్టిఫికెట్లు తీసుకునేందుకే పది రోజులకు పైగా పడుతుందని పార్టీ నాయకులు అన్నారు. ప్రస్తుతం గ్రామాల్లో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, దరఖాస్తు గడువు పెంచాలని సీపీఐ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. పార్టీ మండల అధ్యక్షుడు మండవ వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి రెమిడాల రాజు, చిలుకూరు శాఖ కార్యదర్శి చిలువేరు ఆంజనేయులు, కట్టెకోల నాగేశ్వరరావు, షేక్ జానిమియా తదితరులు పాల్గొన్నారు.


Similar News