పిడుగుపాటుకు నాలుగు మేకలు,గేదె మృతి

నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలంలో పలు గ్రామాల్లో పిడుగు పడింది.

Update: 2024-10-18 15:40 GMT

దిశ,మాడుగులపల్లి; నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలంలో పలు గ్రామాల్లో పిడుగు పడింది. దీంతో మూగజీవాలు మృతి చెందాయి. వివరాల్లోకి వెళితే..శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి పిడుగుపాటుకు గురై అభంగాపురం గ్రామానికి చెందిన బోడ మల్లయ్య చెందిన నాలుగు మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి. అదేవిధంగా మండలం లోని గుర్రప్పగూడెం గ్రామానికి చెందిన పందిరి రామలింగయ్య గేదె పిడుగుపాటుకు గురై మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వేలలో నష్టం వాటిలిందని కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.


Similar News