గంజాయి మొక్కలు పెంచుతున్న వ్యక్తి అరెస్ట్

గుర్రంపోడు మండలం బుడ్డా రెడ్డి గూడెం గ్రామానికి చెందిన సింగం ముత్యాలు (60 )సంవత్సరాలు తన ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలు పెంచుతున్నాడు.

Update: 2024-10-05 15:29 GMT

దిశ, గుర్రంపొడు: గుర్రంపోడు మండలం బుడ్డా రెడ్డి గూడెం గ్రామానికి చెందిన సింగం ముత్యాలు (60 )తన ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలు పెంచుతున్నాడు. గమనించిన స్థానికుల సమాచారంతో..పోలీసులు బుడ్డారెడ్డి గూడెం వెళ్లి పరిశీలించగా సింగం ముత్యాలు తన ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలు సాగు చేస్తున్నాడు. మొత్తం 128 గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో పాల్గొన్న సిఐ ధనుంజయ, గుర్రంపోడు ఎస్సై వేమిరెడ్డి నారాయణరెడ్డి, కొండమల్లెపల్లి ఎస్సై రామ్మూర్తిని, కానిస్టేబుల్ నాగరాజు, నర్సింహులను, దేవరకొండ డిఎస్పి గిరిబాబును ఎస్పీ శరత్ చంద్ర పవర్ అభినందించారు.


Similar News