తీవ్ర జ్వరంతో వ్యక్తి మృతి

తీవ్ర జ్వరంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన వెల్లంకి గ్రామంలో చోటుచేసుకుంది.

Update: 2024-10-05 16:12 GMT

దిశ, రామన్నపేట : తీవ్ర జ్వరంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన వెల్లంకి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెల్లెంకి గ్రామానికి చెందిన మేకల సత్తయ్య (38) గత ఐదు రోజుల నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. చికిత్స నిమిత్తం నేలపట్ల గ్రామంలోని ఓ ఆర్ఎంపి వద్ద చికిత్స చేయించుకుని మందులు వాడుతున్నాడు. శనివారం రోజ ఫిట్స్ వచ్చి నురుగులతో పడిపోయాడు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం కామినేని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరిశీలించగా..అప్పటికే సత్తయ్య మృతి చెందాడని తెలిపారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామన్నపేట ఎస్సై మల్లయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Similar News