అదుపుతప్పి కారు బోల్తా.. ఒకరు మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

మద్దిరాల మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది.

Update: 2024-10-05 15:16 GMT

దిశ మద్దిరాల : మద్దిరాల మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు అదుపుతప్పి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా..ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాద్ జిల్లా కేంద్రానికి చెందిన బత్తిని రవీందర్ గౌడ్ వృత్తిరీత్యా బోర్ వెల్స్ నడుపుతాడు. బోర్ వెల్స్ కోసం మహబూబాద్ నుంచి హైదరాబాదుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో కారులో నలుగురు ప్రయాణిస్తుండగా.. రెడ్డిగూడెం గ్రామ శివారులో వర్షం కారణంగా ప్రమాదవశాత్తు కారు అదుపు తప్పింది. దీంతో బత్తిని రవీందర్ గౌడ్ అక్కడిక్కడే మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్నా రమేష్, ముప్పిడి సత్తయ్య, రామ్ సింగ్ కు తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ఏరియా హాస్పిటల్ కు తరలించారు. 


Similar News