ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది...

Update: 2024-09-28 03:06 GMT

దిశ, చౌటుప్పల్: విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం జాతీయ రహదారి పక్కన కొయ్యలగూడెం వద్ద ఖమ్మం నుంచి మియాపూర్ వైపు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉంది. శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ వైపు వెళ్తున్న కంటైనర్ లారీ బలంగా వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ సంఘటనలో అక్కడికక్కడే ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా 11 మందికి గాయాలు అయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాదులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. 


Similar News