తెలంగాణలో ఏదో ఒక జిల్లాకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలి

తెలంగాణలో ఏదో ఒక జిల్లాకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

Update: 2024-09-27 10:33 GMT

దిశ, చండూరు : తెలంగాణలో ఏదో ఒక జిల్లాకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. గట్టుప్పల్ మండల కేంద్రంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ చేయడం అదృష్టంగా భావిస్తున్నా అన్నారు. తెలంగాణ కోసం పదవీత్యాగం చేసి పార్టీలకు అతీతంగా పోరాటం చేసిన గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు.

    ఆయన ఆలోచనలు, ఆశయాలు, మనం కాపాడుకోవాలని అన్నారు. చేనేత కార్మికులు వారి నైపుణ్యంతో ప్రపంచ స్థాయిలో ఆకట్టుకుంటున్నారని, మన నియోజకవర్గంలో అలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారన్నారు. చేనేత కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్తానని పేర్కొన్నారు. చేనేత కార్మికులు నేసిన చీరలను ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా చూస్తానన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, మాజీ సర్పంచ్ ఈడం రోజా, నాయకులు నామని జగన్నాధం, అవ్వారు శ్రీనివాస్, చేరుపల్లి భాస్కర్, ఆంజనేయులు పాల్గొన్నారు.  

Tags:    

Similar News