ఎంపీ రఘునందన్ రావు ప్రచార రథం ధ్వంసం

మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ప్రచార రథాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు.

Update: 2024-10-21 15:19 GMT

దిశ,దుబ్బాక : మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ప్రచార రథాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. దుబ్బాక మండల పరిధిలోని శివాజీ నగర్ గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని వ్యక్తి ఆదివారం రాత్రి దుబ్బాక లోని ఎంపీ స్వగృహం వద్ద ఉన్న ప్రచార రథం అద్దాలను ధ్వంసం చేశాడు. ప్రచార రథం తో పాటు పట్టణంలోని పలువురి ఆటోలను కూడా ధ్వంసం చేశాడు. ముందుగా ప్రచార రథాన్ని కావాలనే ధ్వంసం చేశారని అనుమానం వ్యక్తం చేసినప్పటికీ సీసీ పుటేజీల్లో చూసిన తర్వాత మతిస్థిమితం లేని వ్యక్తి ధ్వంసం చేసినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రచార రథం, ఆటోల ధ్వంసంపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు.


Similar News