సినిమా ఇండస్ట్రీకి సీఎం రేవంత్ రెడ్డి కొత్త రూల్‌.. స్పందించిన యాక్టర్ మోహన్ బాబు

మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని కామాండ్ కంట్రల్ క్యార్యాలయంలో నూతన వాహనాలను ప్రారంభించారు.

Update: 2024-07-02 16:33 GMT

దిశ, వెబ్ డెస్క్: మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని కామాండ్ కంట్రల్ క్యార్యాలయంలో నూతన వాహనాలను ప్రారంభించారు. అనంతరం రాష్ట్రంలో విచ్చలవిడిగా అందుబాటులో ఉన్న గంజాయి, డ్రగ్స్ పై సీఎం మాట్లాడారు. అలాగే సైబర్ నేరాలు ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యగా తెలిపారు. అనంతరం గంజాయి, డ్రగ్స్, ఇతర నేరాలపై సినిమాల్లో అవగాహన కల్పించాలని, డ్రగ్స్ మహమ్మారికి యువతి బలి అవుతున్న విషయం గురించి మాట్లాడుతూ.. చలనచిత్ర నటీనటులను 1, 2 నిమిషాల వీడియో చేసి, ప్రభుత్వానికి పంపమన్నారు. కాగా దీనిపై స్పందించిన సీనియర్ హీరో మోహన్ బాబు.. తాను ఇంతకు ముందు ఇటువంటి వీడియోలు కొన్ని చేసినట్లు గుర్తు చేశారు. అలాగే ముఖ్యమంత్రి ఆదేశం మేరకు తాను సందేశాత్మకమైన కొన్ని వీడియోలు చేసి ఉడతా భక్తిగా సమాజానికి సేవ చేసుకుంటానని మోహన్ బాబు ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు.

Similar News