Kodandaram : రాష్ట్ర విద్యా కమిషన్ ఏర్పాటుపై ఎమ్మెల్సీ కోదండరామ్ కీలక వ్యాఖ్యలు

రాష్ట్రంలో అస్తవ్యస్తంగా మారిన విద్యా విధానాన్ని పటిష్టమైన పద్ధతిలో నడిపించడానికి రాష్ట్ర విద్యా కమిషన్ ఏర్పాటు అయిందని తెలంగాణ జన సమితి అధినేత, ఎమ్మెల్సీ కోదండరామ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-21 12:58 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో అస్తవ్యస్తంగా మారిన విద్యా విధానాన్ని పటిష్టమైన పద్ధతిలో నడిపించడానికి రాష్ట్ర విద్యా కమిషన్ ఏర్పాటు అయిందని తెలంగాణ జన సమితి అధినేత, ఎమ్మెల్సీ కోదండరామ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యా కమిషన్ సభ్యులుగా తెలంగాణ జన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు నియమితులైన సందర్భంగా ఆయనకు పార్టీ స్టేట్ కార్యాలయంలో ఘనంగా అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ పీఎల్ విశ్వేశ్వరరావు నియమాకంతో విద్యా కమిషన్‌కి గౌరవం వచ్చిందని అన్నారు. రాష్ట్రంలో ప్రాథమిక విద్య నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు సమూల మార్పులు చేపట్టి పేద, బడుగు, బలహీన వర్గాల వారందరికీ సముచిత న్యాయం కల్పించే లక్ష్యంతో విద్యా కమిషన్ పనిచేయాలని సూచించారు.

ఈ సందర్భంగా పీఎల్ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ విద్యారంగంలో తనకున్న 40 ఏళ్ల అనుభవాన్ని ఉపయోగించి ఉన్నత విద్యలో సంస్కరణలు తీసుకువస్తామని అన్నారు. టీజేఎస్ పార్టీ ఏర్పడిన నాటి నుంచి విద్యారంగ సమస్యల పరిష్కారానికి కోదండరామ్ నేతృత్వంలో అనేక ఉద్యమాలు చేశామని తెలిపారు. విద్యా కమిషన్ ఏర్పాటులో కోదండరామ్ కీలక పాత్ర పోషించారని తెలుపుతూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఎం. నరసయ్య, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బైరి రమేష్, గోపగాని శంకర్రావు, పల్లె వినయ్ గౌడ్, ఆశప్ప, రమేష్ ముదిరాజ్, మహిళ విభాగం అధ్యక్షురాలు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


Similar News