MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు మరోసారి అస్వస్థత.. రేపు ఢిల్లీకి కేటీఆర్, హరీశ్ రావు!

తిహార్ జైల్లో ఉన్న కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు.

Update: 2024-08-22 07:18 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా ఢిల్లీ తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. వైరల్ ఫీవర్ తో పాటు గైనిక్ సమస్యతో ఆమె బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో ఆమెను అధికారులు ఎయిమ్స్ కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. కాగా గత జులైలోనూ కవిత జ్వరం, గొంతునొప్పితో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అధికారులు ఆమెను జైలు నుంచి దీనదయార్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం తిరిగి జైలుకు తరలించారు. తాజాగా మరోసారి కవిత అస్వస్థతకు గురికావడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిటెండ్, కవిత సోదరుడు కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు రేపు ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే కవిత కేసు విచారణను నిన్న ఈ నెల 28కి కోర్టు వాయిదా వేసింది. బుధవారం కవితపై ఢిల్లీ రౌస్ అవెన్యూ కర్టులో విచారణ జరగ్గా తిహార్ జైలు నుంచి కవితను అధికారులు వర్చువల్ గా కోర్టులో హాజరుపరిచారు.

Tags:    

Similar News