అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆసుపత్రిలో చేరారు.

Update: 2024-10-01 03:28 GMT

దిశ, శేరిలింగంపల్లి/వెబ్‌డెస్క్: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఎమ్మెల్సీ కవిత మంగళవారం ఉదయం గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్‌లో చేరారు. ఆమెకు వైద్యులు పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో తీహార్ జైలులో ఉన్న సమయంలో ఎమ్మెల్సీ కవిత గైనిక్ సమస్యలతో బాధపడ్డారు. తీవ్ర జ్వరంతో పలుమార్లు అనారోగ్యానికి గురైనట్లు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. ఆ నేపథ్యంలోనే ఢిల్లీ ఎయిమ్స్‌లో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి గైనిక్ సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు ప్రకటించారు. ఇక ఇప్పుడు మరోసారి అలాంటి ఇబ్బందులతో బాధపడుతున్న కవిత ఈ రోజు ఉదయం ఆస్పత్రిలో చేరారు. సాయంత్రానికి పూర్తి వైద్య పరీక్షలు పూర్తి అవుతాయని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. కవిత వెంట ఆమె భర్త అనిల్ సైతం ఆస్పత్రికి వచ్చారు. కాగా.. ఉన్నట్లుండి కవిత ఆసుపత్రిలోచేరారనే వార్తలతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది.


Similar News