ఏపీ సీఎం చంద్రబాబుతో మంత్రి ఉత్తమ్ భేటీ.. వెంట భార్య పద్మావతి

తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఆయన భార్య ఎమ్మెల్యే పద్మావతి గురువారం అమరావతి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో భేటీ అయ్యారు.

Update: 2024-09-12 17:27 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఆయన భార్య ఎమ్మెల్యే పద్మావతి గురువారం అమరావతి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో భేటీ అయ్యారు. ఇది మర్యాదపూర్వక సమావేశం మాత్రమేనని, నాల్గోసారి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు అభినందనలు తెలిపామని మంత్రి ఉత్తమ్ ఒక ప్రకటనలో తెలిపారు. వీరిద్దరి మధ్య భేటీ సందర్భంగా ఇరు రాష్ట్రాల రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఇటీవల కురిసిన వర్షాలు, వరదలతో రెండు తెలుగు రాష్ట్రాలకు జరిగిన నష్టాన్ని కూడా చర్చించుకున్నట్లు తెలిసింది. రెండు రాష్ట్రాల మధ్య సాగునీటి ప్రాజెక్టుల వివాదాలు, భవిష్యత్తుల పరిష్కరించుకోవాల్సిన ఆవశ్యకత తదితరాలపైనా చర్చించినట్లు సమాచారం.


Similar News