విమానంలో సాంకేతిక లోపం.. గంటపాటు వెయిట్ చేసిన మంత్రి, ఎమ్మెల్యేలు

శంషాబాద్ విమానాశ్రయం నుండి కొచ్చిన్ వెళ్లాల్సిన (6E 6707) ఇండిగో విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది.

Update: 2024-05-14 07:20 GMT

దిశ, శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయం నుండి కొచ్చిన్ వెళ్లాల్సిన (6E 6707) ఇండిగో విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. విమానంలోని ఇంజిన్లో సాంకేతిక లోపం రావడంతో టేకప్ కాకుండా గంటపాటు రన్‌వేపై నిలిచిపోయింది. ఈ ఫ్లైట్‌లో తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, ఆదినారాయణ, వీరితోపాటు 106 మంది విధానంలో నిరీక్షించారు. ఎయిర్ లైన్స్ అధికారులు స్పందించి గంటపాటు శ్రమించి విమానాన్ని బాగు చేయడంతో తిరిగిపోయింది.



 


Tags:    

Similar News