మేము ఎప్పుడూ ప్రభుత్వాలకు తలొగ్గలేదు.. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని పాతబస్తీ మూసీ పరివాహక ప్రాంతం(Musi Catchment Areas)లో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ(MLA Akbaruddin) పర్యటించారు.

Update: 2024-10-24 03:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని పాతబస్తీ మూసీ పరివాహక ప్రాంతం(Musi Catchment Areas)లో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ(MLA Akbaruddin) పర్యటించారు. ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఎంఐఎం పార్టీ బాధితులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఒవైసీ మీడియాతో మాట్లాడారు. ఖరీదైన ఇళ్లు వదిలేసి వెళ్లమంటే ఎలా వెళ్తారు? ఎక్కడికి వెళ్తారని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎన్నో డబ్బులు ఖర్చు చేసి ఇష్టంగా కట్టుకున్న ఖరీదైన ఇళ్లను కూల్చివేసి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు.

తాము ఏనాడూ ప్రభుత్వాలకు తలొగ్గలేదని చెప్పారు. అన్ని పార్టీలు మూసీపై రాజకీయాలు చేస్తున్నాయి చేస్తున్నాయని అన్నారు. వ్యాపారాలు ఉన్నచోటే ఇళ్లు కట్టుకున్నారని.. ఇప్పుడు ఉన్నపళంగా కూల్చివేస్తే ఎక్కడికో వెళ్లి ఎలా వ్యాపారాలు చేస్తారని మండిపడ్డారు. మూసీ బాధితులు ఎవరూ భయాందోళన చెందాల్సిన పనిలేదని.. తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పేదల గూడు కూలుస్తామంటే ఎట్టిపరిస్థితుల్లో ఊరుకోము అని అన్నారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని అన్నారు.

Tags:    

Similar News