ప్రజలకు నీటి సమస్య రాకుండా చేస్తాం : ఎంపీ ఈటల

ప్రజలకు నీటి సమస్య లేకుండా చేస్తామని, మల్కాజిగిరి పార్లమెంట్ ను

Update: 2024-06-29 13:46 GMT

దిశ,కీసర: ప్రజలకు నీటి సమస్య లేకుండా చేస్తామని, మల్కాజిగిరి పార్లమెంట్ ను దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. శనివారం నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ను కలిసి పలు సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా ఎంపీ సానుకూలంగా స్పందిస్తూ... ప్రజా సమస్యలపై ఉద్యమంలా పరిష్కారం చేస్తామని అన్నారు. గతంలో మల్కాజిగిరి పార్లమెంట్ అభివృద్ధిలో వెనుకబడిందని, అత్యధిక నిధులు కేటాయించి మల్కాజిగిరిని మోడల్ గా మార్చుతానని పేర్కొన్నారు. అనంతరం వాటర్ ఎండీ అశోక్ రెడ్డిని ఫోన్ లో మాట్లాడి నీటి సమస్య తలెత్తకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిర్జాదిగూడ మేయర్ జక్క వెంకటరెడ్డి, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Similar News