అభివృద్ధిలో పీర్జాదిగూడ పలు మున్సిపాలిటీలకు ఆదర్శం..: ఎమ్మెల్యే మల్లారెడ్డి

అభివృద్ధిలో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు పీర్జాదిగూడ ఆదర్శంగా

Update: 2024-07-07 12:57 GMT

దిశ,మేడిపల్లి: అభివృద్ధిలో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు పీర్జాదిగూడ ఆదర్శంగా నిలిచిందని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా అయన పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 2వ డివిజన్ శ్రీ సాయి నగర్ కాలనీ యందు నూతన కమ్యూనిటీ హాల్ ను మేయర్ జక్క వెంకట్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ....బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో తెలంగాణ అభివృద్ధిలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు దిక్సూచిగా నిలిచిందన్నారు. 24 గంటల నాణ్యమైన కరెంట్,ఫ్లై ఓవర్లు, ఐటీ, ఫార్మా, అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించింది.

మిషన్ భగీరథ ద్వారా రిజర్వాయర్లు, ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించి ప్రతి గడపకు మంచి నీరు అందించిన ఘనత కేసీఆర్ నాయకత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మేడ్చల్ నియోజకవర్గం అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు బండారి రవీందర్, ప్రధాన కార్యదర్శి రఘు వర్ధన్ రెడ్డి, కార్పొరేటర్లు సుభాష్ నాయక్, కొల్తూరి మహేష్, బచ్చ రాజు, మద్ది యుగేందర్ రెడ్డి,కౌడే పోచయ్య, మధుసూదన్ రెడ్డి, దొంతిరి హరిశంకర్ రెడ్డి, నాయకులు లేతాకుల రఘుపతి రెడ్డి, అలవాల దేవేందర్ గౌడ్, జావీద్ ఖాన్, డివిజన్ అధ్యక్షులు బాలరాజు, వెంకన్న, శ్రీనివాస్, కిరణ్, మల్లం వెంకటేష్ గౌడ్,సాయి నగర్ అసోసియేషన్ అధ్యక్షుడు బింగి ఉపేందర్, ప్రధాన కార్యదర్శి ఆరుట్ల నవీన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


Similar News