ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకే పార్కులు

ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు పార్కులు ఎంతో దోహదపడతాయని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.

Update: 2024-10-10 12:08 GMT

దిశ, కూకట్​పల్లి : ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు పార్కులు ఎంతో దోహదపడతాయని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బాలాజీనగర్​ డివిజన్​లోని ఫ్రీడమ్​ పార్కును ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గురువారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ బాలాజీనగర్​ ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు థీం పార్కును అందుబాటులోకి తీసుకువస్తున్నామని అన్నారు. పార్కు అభివృద్ధి పనులు చివరి దశలో ఉన్నాయని, త్వరలో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్​ బాబురావు, ఏఎంఓహెచ్​ కార్తిక్​, డీఈ శ్రీదేవి, ఏఈ సామాల శ్రీనివాస్​, స్థానిక నాయకులు ప్రభాకర్​, ఆరోగ్యరెడ్డి పాల్గొన్నారు. 

Tags:    

Similar News