అర్ధరాత్రి వైన్ షాపులో అగ్ని ప్రమాదం.. 4 లక్షల మద్యం ఆవిరి..!

ఘట్కేసర్ మండలం అవుషాపూర్ గ్రామంలోని శ్రీనిధి వైన్స్‌లో మంగళవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాద సంభవించింది. వైన్స్ మూసేసిన తర్వాత

Update: 2024-07-17 05:23 GMT

దిశ, ఘట్కేసర్: ఘట్కేసర్ మండలం అవుషాపూర్ గ్రామంలోని శ్రీనిధి వైన్స్‌లో మంగళవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాద సంభవించింది. వైన్స్ మూసేసిన తర్వాత అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో వైన్స్‌ లోపలి నుండి పొగలు రావడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వైన్స్ వద్దకు చేరుకుని మంటలను అదుపు చేశారు. షాప్‌లో దాదాపు రూ.40 లక్షలు మద్యం స్టాక్ ఉంటుందని, అగ్నిప్రమాదంలో దాదాపు రూ.3 నుంచి 4 లక్షల ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని యజమాని బొక్క మల్లారెడ్డి తెలిపారు. సీసీ టీవీ కెమెరాలు హార్డ్ డిస్క్‌లు కూడా ఈ ప్రమాదంలో కాలిపోయాయని చెప్పారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్నిప్రమాదం సంభవించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Similar News