సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష అభ్యర్థి అంక్షారెడ్డి..

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని బుధవారం యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష అభ్యర్థి అంక్షారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

Update: 2024-09-25 15:11 GMT

దిశ, గజ్వేల్ /కొండపాక : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని బుధవారం యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష అభ్యర్థి అంక్షారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సభ్యత్వ నమోదు పై రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన స్పందనను ఆమె సీఎం దృష్టికి తెచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ సర్కార్ చేపడుతున్న సంక్షేమ పథకాల పట్ల యువత నుండి మంచి స్పందన వచ్చిందని ఆయన దృష్టికి తెచ్చారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి అంక్షా రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన సభ్యత్వ నమోదును ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రతినిధి వేం నరేందర్ రెడ్డి, మీడియా విభాగం ఇన్చార్జి అయోధ్య రెడ్డి, సిద్దిపేట డీసీసీ అధ్యక్షులు తూంకుంట నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Similar News