ట్రాక్టర్ బ్యాటరీల వరస దొంగతనాలు..

వ్యవసాయ రైతుల ట్రాక్టర్ బ్యాటరీలు వరుస దొంగతనాలు చేస్తూ దొంగలు హల్ చల్ చేస్తున్నారు.

Update: 2024-09-29 08:54 GMT

దిశ, మద్దూరు : వ్యవసాయ రైతుల ట్రాక్టర్ బ్యాటరీలు వరుస దొంగతనాలు చేస్తూ దొంగలు హల్ చల్ చేస్తున్నారు. మద్దూరు మండలం ధర్మారం, సలాక్ పూర్ గ్రామాలలో నాలుగు రోజుల క్రితం దొంగలు ఆరు ట్రాక్టర్ల బ్యాటరీలు ఎత్తుకెళ్లిన సంఘటన మరువక ముందే, ఆదివారం మండలంలోని రేబర్తి గ్రామంలో నల్ల భూపతి రెడ్డి, బొమ్మగాని చంద్రం, బొమ్మ వెంకటయ్య, రైతుల ట్రాక్టర్ బ్యాటరీలు దొంగిలించినట్లు గ్రామస్తులు తెలిపారు. ట్రాక్టర్ బ్యాటరీల వరుస దొంగతనాలు జరుగుతుండడంతో ట్రాక్టర్ యాజమాన్యులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ పొలం వద్ద, ఇంటి ముందర ట్రాక్టర్లు పెట్టాలంటే ఎప్పుడు ఏం జరుగుతుందోనని ట్రాక్టర్ యజమానులు భయం భయంతో చూస్తున్నారు. దొంగతనాలు అరికట్టి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


Similar News