ఆ రోడ్డు పై ప్రయాణించలేం సారూ..

జహీరాబాద్ మండల పరిధిలోని అల్గోల్ రోడ్డు పై గ్రామస్తులు బైఠాయించి రాస్తారోకో చేపట్టారు.

Update: 2024-09-16 09:08 GMT

దిశ, జహీరాబాద్ : జహీరాబాద్ మండల పరిధిలోని అల్గోల్ రోడ్డు పై గ్రామస్తులు బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. రోడ్డు పాడై సంవత్సరాలు గడుస్తున్నా మరమ్మత్తులకు నోచుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంతల మయమైన రోడ్డు పై ప్రయాణం నరకంగా మారిందని, దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో రాస్తారోకో చేపట్టామంటున్నారు. రోడ్డు మరమ్మతులు ప్రయాణికుల సమస్య పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు.


Similar News