సామాన్య ప్రయాణికుడిలా బస్సులో ప్రయాణించిన కలెక్టర్..

ఓ సామాన్య ప్రయాణికుడిలా మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం బస్సు ప్రయాణం చేశారు.

Update: 2025-03-23 09:33 GMT
సామాన్య ప్రయాణికుడిలా బస్సులో ప్రయాణించిన కలెక్టర్..
  • whatsapp icon

దిశ, నిజాంపేట : ఓ సామాన్య ప్రయాణికుడిలా మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం బస్సు ప్రయాణం చేశారు. ఈ మేరకు మెదక్ నుంచి రామాయంపేటకు సైకిల్ పై వచ్చి బస్టాండ్ లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణ ప్రాంగణంలో పారిశుద్ధ్యం లేకుండా చూడాలని, వేసవి కాలనీ దృష్టిలో ఉంచుకొని తాగునీటిని ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఆర్టీసీ బస్సులో సామాన్య ప్రయాణికుడిలా ప్రయాణిస్తూ ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బస్సు లో మెదక్ కు తిరిగి వెళ్లారు. ఆయన వెంట మెదక్ ఆర్టీసీ డీఎం, మున్సిపల్ సిబ్బంది, అధికారులు ఉన్నారు.


Similar News