సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాం : సంగారెడ్డి కలెక్టర్

హత్నూర మండలం దౌల్తాబాద్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ క్రాంతి

Update: 2024-10-24 11:15 GMT

దిశ, హత్నూర : హత్నూర మండలం దౌల్తాబాద్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అనంతరం పాఠశాలలో ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్ ను పరిశీలించారు. ఈ ఏడాది పదో తరగతి ఉత్తమ ఫలితాలు సాధన కోసం ఇప్పటి నుంచి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, విద్యార్థులను ప్రతిభ ఆధారంగా గ్రూపులుగా విభజించి వారి సామర్థ్యాల పెంపొందించడం కోసం ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. పాఠశాలలో ఉన్న సమస్య లను ఉపాధ్యాయులు, విద్యార్థులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.సమస్యల పరిష్కారం కోసం కృషి చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. పదో తరగతి లో 100% ఫలితాలు సాధించే విధంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు కృషి చేయాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.


Similar News