తాళాలు పగలగొట్టి పాఠశాలలో బియ్యం అపహరణ

పాఠశాల తాళాలు పగలగొట్టి అందులో నుండి క్వింటాల్ బియ్యాన్ని గుర్తు తెలియని దుండగులు అపహరించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Update: 2024-10-26 14:30 GMT

దిశ, చేగుంట : పాఠశాల తాళాలు పగలగొట్టి అందులో నుండి క్వింటాల్ బియ్యాన్ని గుర్తు తెలియని దుండగులు అపహరించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చేగుంట మండల పరిధిలోని కర్నాల్ పల్లి ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు పాఠశాల తాళం పగులగొట్టి తలుపులు తీసి అందులో ఉన్న క్వింటాల్ బియ్యాన్ని తీసుకెళ్లినట్లు ఫిర్యాదు చేశారు. సుమారు 6000 రూపాయలు విలువ చేసే 50 కేజీల రెండు బస్తాలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Similar News