గురుకుల పాఠశాలల్లో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు..

సిద్దిపేట అర్బన్ మండలంలోని మిట్టపల్లి గ్రామంలో గల కేజీబీవీ, తెలంగాణా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంను రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, సభ్యులు ఆనంద్, గోవర్ధన్ రెడ్డి, జ్యోతి, భారతిలు ఆకస్మికంగా సందర్శించారు.

Update: 2024-09-28 10:17 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట అర్బన్ మండలంలోని మిట్టపల్లి గ్రామంలో గల కేజీబీవీ, తెలంగాణా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంను రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, సభ్యులు ఆనంద్, గోవర్ధన్ రెడ్డి, జ్యోతి, భారతిలు ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం, ఆహార తయారీకి ఉపయోగిస్తున్న సరకులను పరిశీలించారు.

అనంతరం క్లాస్ రూంలో విద్యార్థులతో మాట్లాడి ఆహార నాణ్యత గురించి ఆరా తీశారు. ఆరోగ్యం కొరకు తీసుకుంటున్న చర్యలు, వైద్య పరీక్షల నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. కౌమార దశలో సరైన పౌష్టికాహారం తీసుకుంటేనే భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉంటారని, తప్పకుండా మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని ప్రిన్సిపాల్స్ ను ఆదేశించారు.


Similar News