నారింజ వాగులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం..

నారింజ వాగు దాటుతుండగా జరిగిన ప్రమాదంలో గల్లంతైన షాకీర్ (40) మృతదేహం శుక్రవారం లభ్యమైంది.

Update: 2024-09-28 09:03 GMT

దిశ, జహీరాబాద్ : నారింజ వాగు దాటుతుండగా జరిగిన ప్రమాదంలో గల్లంతైన షాకీర్ (40) మృతదేహం శుక్రవారం లభ్యమైంది. కర్ణాటక బీదర్ మైలూర్ కు చెందిన ఇస్మాయిల్ (60), షాకీర్(40)లు ఇద్దరు కలిసి గత బుధవారం జహీరాబాద్ వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. స్థానికుల సహాయంతో ఇస్మాయిల్ ప్రాణాలతో బయటపడగా షాకీర్ మాత్రం వరద నీటిలో కొట్టుకుపోయారు. అప్పటి నుంచి ఆయన ఆచూకి కోసం పలు విధాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం ఉదయం ముళ్ళ పొదల్లో చిక్కిన మృతదేహం వాగులో తేలింది. కాగా మృతదేహాన్ని వెలికి తీసి శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.


Similar News