ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కు అవమానం..

జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల పై సిద్దిపేట కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సమీక్ష సమావేశంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు అవమానం జరిగిందని డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ ఆరోపించారు.

Update: 2024-09-25 15:56 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి : జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల పై సిద్దిపేట కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సమీక్ష సమావేశంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు అవమానం జరిగిందని డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ ఆరోపించారు. జిల్లా ఇంచార్జి మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీల నేమ్ ప్లేట్ బోర్డుల్లో వారి పేర్ల చివర గారు పెట్టి దళితుడైన రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య నేమ్ ప్లేట్ లో పేరు చివర గారు పెట్టక పోవడం దురదృష్టకరం అన్నారు.

ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ను అవమానించిన జిల్లా కలెక్టర్, అధికారుల పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిర్లక్ష్య వివక్ష వైఖరి పై మంత్రి, కలెక్టర్ అధికార యంత్రాంగం బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరిగితే సమావేశాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో నిరసన వ్యక్తం కావడంతో నేమ్ ప్లేట్ మార్చారని జాతీయ కార్యదర్శి పి.శంకర్ వెల్లడించారు.


Similar News