దాడులకు భయపడం.. కార్యకర్తలకు అండగా ఉంటాం : ఎమ్మెల్యే సునీత రెడ్డి

ఆదివారం రాత్రి జరిగిన తమ కార్యకర్తల పై జరిగిన దాడులకు తాము ఏమాత్రం భయపడే ప్రసక్తి లేదని నర్సాపూర్ నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటామని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి అన్నారు.

Update: 2024-09-23 09:50 GMT

దిశ, నర్సాపూర్ : ఆదివారం రాత్రి జరిగిన తమ కార్యకర్తల పై జరిగిన దాడులకు తాము ఏమాత్రం భయపడే ప్రసక్తి లేదని నర్సాపూర్ నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటామని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి జరిగిన ఘటన పై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి దాడులు చేయడం మంచి పద్ధతి కాదని సూచించారు. ఓటు వేసి గెలిపించిన ప్రజల పై దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు.

ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తే సహనంతో ఓపికతో తీసుకోవాలి కానీ దాడులు చేయడం మంచి పద్ధతి కాదని హితువు పలికారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రెచ్చగొట్టే మాటలు మాట్లాడి కార్యకర్తలకు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారని అన్నారు. తమ కార్యకర్తల పై దాడులు ఎవరు చేయిస్తున్నారు, ఎందుకు చేస్తున్నారోనని ఆమె ప్రశ్నించారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, సీనియర్ నాయకులు మన్సూర్ తదితరులు ఉన్నారు.


Similar News