MLA : కమిటీల పేరిట రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం

కల్ల బొల్లి మాటలతో రైతులను మోసం చేస్తూ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు.

Update: 2024-10-20 10:25 GMT

దిశ, హత్నూర : కల్ల బొల్లి మాటలతో రైతులను మోసం చేస్తూ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఆదివారం మండల పరిధిలోని దౌల్తాబాద్ తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ముందుగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ రైతులను, నిరుద్యోగులను, పేరు చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు వారినే నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు సంవత్సరానికి రూ.10 వేల ఇస్తే మేము గెలిచాక రూ.15 వేల ఇస్తామని కల్ల బొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారన్నారు. రాష్ట్రంలో రుణమాఫీ ఎక్కడ కూడా పూర్తిస్థాయిలో మాఫీ చేయలేదని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కమిటీల పేరిట రైతులను మోసం చేస్తూ రైతు భరోసాను ఇవ్వకుండా డ్రామాలు అవుతుందన్నారు. తక్షణమే రైతు రుణమాఫీ, రైతు భరోసా, డబ్బులను విడుదల చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్, దేవేందర్ రెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, మాజీ ఎంపీపీ నర్సింలు, బీఆర్ఎస్ నాయకులు మాయిని వీరేందర్, కిషోర్ నేత, తదితరులు పాల్గొన్నారు.


Similar News