మిషన్ భగీరథ నీటి సరఫరాపై కేంద్ర బృందం సర్వే

మండల పరిధిలోని రజాక్ పల్లి గ్రామంలో శుక్రవారం కేంద్ర బృందం సభ్యులు పర్యటించారు.

Update: 2024-07-05 11:00 GMT

దిశ, నిజాంపేట : మండల పరిధిలోని రజాక్ పల్లి గ్రామంలో శుక్రవారం కేంద్ర బృందం సభ్యులు పర్యటించారు. జల జీవన్ మిషన్ లో భాగంగా గ్రామంలో అధికారులు పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందుతున్న మిషన్ భగీరథ నీటి సరఫరాపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. నీటి నాణ్యతను వారు పరిశీలించారు. ప్రతి ఒక్కరికీ స్వచ్ఛమైన నీటిని అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట ఆర్డబ్ల్యూఎస్ ఏఈ భిక్షపతి, కేంద్ర బృందం సభ్యులు పాల్గొన్నారు. 


Similar News