Minister : హార్టికల్చర్ సర్వీసెస్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి

సంగారెడ్డి పట్టణం రాజంపేట గంగా నర్సరీలో హార్టి కల్చర్ సర్వీసెస్ సెంటర్ ను ఆదివారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు

Update: 2024-10-27 11:22 GMT

దిశ, సంగారెడ్డి మున్సిపాలిటీ: సంగారెడ్డి పట్టణం రాజంపేట గంగా నర్సరీలో హార్టి కల్చర్ సర్వీసెస్ సెంటర్ ను ఆదివారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. గంగా నర్సరీ ప్రొప్రైటర్ ఐసీ మోహన్ గృహప్రవేశానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐసీ మోహన్ మంత్రి దామోదర రాజనర్సింహను సత్కరించి మేమేంటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ, టీ జీ ఐ ఐ సీ చైర్ పర్సన్ నిర్మలా రెడ్డి, ఎంపీ సురేష్ షెట్కార్, ఎం ఎల్ సీ కోదండరామ్, ఎంఎల్ఏ చింతా ప్రభాకర్, సినిమా నటులు శ్రీకాంత్, శివాజీ రాజా, వివిధ పార్టీల నేతలు గోదావరి అంజిరెడ్డి, రాజేశ్వర్ రావు దేశ్ పాండే, మురళీ యాదవ్, రాజు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.


Similar News