ఏడుపాయల హుండీ లెక్కింపు..ఆదాయం ఎంతంటే..?

పాపన్నపేట మండలం ఏడుపాయల వన దుర్గ మాత ఆలయ హుండీని

Update: 2024-10-23 13:05 GMT

దిశ, పాపన్నపేట : పాపన్నపేట మండలం ఏడుపాయల వన దుర్గ మాత ఆలయ హుండీని దేవాదాయ, ధర్మాదాయ శాఖ హుండీ ఇన్చార్జ్, సహాయ కమిషనర్ సుధాకర్ రెడ్డి సమక్షంలో లెక్కించారు. కరీంనగర్ కు చెందిన సేవా సమితి సభ్యులు, ఆలయ సిబ్బంది లెక్కించారు. గడిచిన 83 రోజుల హుండీని లెక్కించగా రూ.39,91,361 ఆదాయం సమకూరింది. బంగారం, వెండి ఆభరణాలను తిరిగి హుండీలోనే వేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. స్థానిక ఎస్సై శ్రీనివాస్ గౌడ్, సిబ్బంది ఆధ్వర్యంలో పర్యవేక్షణ కొనసాగింది.


Similar News