MLA : దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు

దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సోమవారం అన్నారు.

Update: 2024-10-21 09:33 GMT

దిశ, నిజాంపేట: దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సోమవారం అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం బచ్చురాజు పల్లి, రజక్ పల్లి, కల్వకుంట, వెంకటాపూర్ గ్రామాల్లో ఐకేపీ, సొసైటీ కేంద్రాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. అనంతరం అనారోగ్యానికి గురైన కాంగ్రెస్ పార్టీ నాయకులు మైనుద్దీన్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెదక్ జిల్లా వ్యాప్తంగా 478 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి క్విటాకి రూ. 2,300 పాటు సన్న రకం ధాన్యానికి రూ. 500 రూపాయలు బోనస్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులతో పాటు మండల నాయకులు దేశేట్టి సిద్దరాములు, పంజా మహేందర్ ,నసీరుద్దీన్ , లింగం గౌడ్, వెంకట్ గౌడ్, అజయ్, ముత్యాల సత్యనారాయణ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, మసూద్, మోహన్ రెడ్డి, వినోద్, శ్రీను తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.


Similar News