పెండింగ్ నిధులు విడుదల చేయడం కోసం కృషి చేస్తా : ఎమ్మెల్యే

నర్సాపూర్ మున్సిపల్ కు రావాల్సిన పెండింగ్ నిధుల కోసం కృషి చేస్తానని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు.

Update: 2024-06-29 14:45 GMT

దిశ, నర్సాపూర్: నర్సాపూర్ మున్సిపల్ కు రావాల్సిన పెండింగ్ నిధుల కోసం కృషి చేస్తానని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ అధ్యక్షతన సాధారణ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం నర్సాపూర్ పట్టణంలో జరిగే వివిధ అభివృద్ధి పనులపై చర్చించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్, కమిషనర్ జైత్ రామ్ నాయక్, మేనేజర్ మధుసూదన్, వైస్ చైర్మన్ నహీం, ఆయా వార్డుల కౌన్సిలర్లు గోడ రాజేందర్, బచ్చేష్ యాదవ్, సురేష్, రామచందర్, యాదగిరి, లత, రుక్కమ్మ, లక్ష్మి, సరిత, సునీత తదితరులు ఉన్నారు.

Similar News