దిశ ఎఫెక్ట్.. చెల్లెమన్​​ కుంట కబ్జాపై స్పందించిన అధికారులు

చెల్లెమన్ కుంట కబ్జా! అనే శీర్షిక దిశ మొదటి పేజీలో ప్రచురించిన కథనానికి శుక్రవారం ఇరిగేషన్ అధికారులు స్పందించారు.

Update: 2024-07-05 13:10 GMT

దిశ, హత్నూర : చెల్లెమన్ కుంట కబ్జా! అనే శీర్షిక దిశ మొదటి పేజీలో ప్రచురించిన కథనానికి శుక్రవారం ఇరిగేషన్ అధికారులు స్పందించారు. అధికారులు కుంటను పరిశీలించారు. హత్నూర మండలం దౌల్తాబాద్ గ్రామ శివారులోని దౌలాపూర్ రహదారి పక్కన ఉండడంతో కొందరు ఎఫ్టిఎల్ , బఫర్ జోన్ ఉన్నదని మండల ఇరిగేషన్ అధికారి భూమిపుత్ర వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా

    వారు మాట్లాడుతూ కుంట కబ్జా చేసిన విషయం వాస్తవమని, వారిపై తహసిల్దార్ షేక్ ఫర్వీన్ తో పాటు హత్నూర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. ఎవరైనా కుంటలు, చెరువులను కబ్జా చేసి అక్రమాలకు పాల్పడినట్లయితే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. గ్రామాలలో చెరువు కుంటలు కబ్జా చేశారని సమాచారం ఇస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.  


Similar News