జహీరాబాద్-తిరుపతి బస్సు సర్వీస్ వేళల్లో మార్పులు

జహీరాబాద్-తిరుపతి బస్సు సర్వీస్ వేళల్లో మార్పులు చేసినట్లు డిపో

Update: 2024-10-24 15:32 GMT

దిశ,జహీరాబాద్: జహీరాబాద్-తిరుపతి బస్సు సర్వీస్ వేళల్లో మార్పులు చేసినట్లు డిపో మేనేజర్ జాకీర్ హుస్సేన్ పేర్కొన్నారు. స్థానిక డిపో నుండి వయా హైదరాబాద్, కర్నూలు మీదుగా తిరుపతి కి నడుపుతున్న సూపర్ లగ్జరీ బస్సు సాయంత్రం 6:00 గంటలకు బయలుదేరి ఉదయం 08:00 గం లకు చేరుకుని, తిరిగి రాత్రి 08:50 గం.లకు తిరుపతి నుండి బయలుదేరి ఉదయం 10:30 గం లకు జహీరాబాద్ చేరుకుంటుందన్నారు. ఈ సర్వీసు ఈ నెల 26వ తేదీ నుంచి అమలవుతుందన్నారు.

మధ్యాహ్నం 01:15 నిమిషాలకు జహీరాబాద్ నుంచి బయలుదేరి, తిరుపతికి ఉదయం 03:30 నిమిషాల కు చేరుతుంది. మరల తిరుపతి నుండి ఉదయం 09:00 గం.లకు బయలుదేరి జహీరాబాద్ కు రాత్రి 10:45 ని లకు చేరుకుంటుందన్నారు. కావున తిరుపతికి వెళ్లే ప్రయాణికులు ఈ సమయ వేళలను గమనించి బస్టాండ్ లో గల రిజర్వేషన్ బుకింగ్ కౌంటర్ లో సంప్రదించి రిజర్వేషన్ టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు.


Similar News