కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి : మానకొండూరు ఎమ్మెల్యే

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మానకొండూర్ ఎమ్మెల్యే

Update: 2024-10-23 14:29 GMT

దిశ,బెజ్జంకి : కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. బుధవారం మండల పరిధిలోని దేవక్కపల్లి, వడ్లూరు , గూడెం,వీరాపూర్,దాచారం, బెజ్జంకి గ్రామాల్లో ఐకేపీ, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొంటుందన్నారు.

ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని ఎట్టి పరిస్థితుల్లోను దళారులకు అమ్మి మోసపోవద్దని ఆయన రైతులనూ కోరారు. ఈ కార్యక్రమంలో ప్యాంక్స్ చైర్మన్ శరత్ రావు, ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, వైస్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఓగ్గు దామోదర్, ముక్కస రత్నాకర్ రెడ్డి, యండి , పులి సంతోష్,సాదిక్, జంగిడి సంజీవరెడ్డి, గోవర్థన్ రెడ్డి,రావుల రామకృష్ణ రెడ్డి, పంజాల అంజయ్, ఏఎంసీ డైరెక్టర్లు, కాంగ్రెస్ అనుబంధ కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Similar News