కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి : హరీష్ రావు

ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని మాజీ

Update: 2024-10-19 14:15 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి : ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయిలో వడ్ల కొనుగోలు కేంద్రాలపై సివిల్ సప్లై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా కొనుగోలు కేంద్రాల పై ఆరా తీశారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ... ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలన్నారు. రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యం మిల్లర్స్ కి అలాట్మెంట్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి తనుజ, డీఎం ప్రవీణ్, ఏపీఎంలు తదితరులు పాల్గొన్నారు.


Similar News