ఎమ్మెల్యే సునీత రెడ్డి అనుచరుల పై దాడి..

శివంపేట మండల పరిధిలోని గోమారం గ్రామంలో ఆదివారం రాత్రి గణేష్ శోభాయాత్ర సందర్భంగా తలెత్తిన వివాదంలో సునీత రెడ్డి అనుచరుల పై దాడి చేయడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

Update: 2024-09-23 09:44 GMT

దిశ, నర్సాపూర్ : శివంపేట మండల పరిధిలోని గోమారం గ్రామంలో ఆదివారం రాత్రి గణేష్ శోభాయాత్ర సందర్భంగా తలెత్తిన వివాదంలో సునీత రెడ్డి అనుచరుల పై దాడి చేయడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వివరాల్లోకెళితే శివంపేట మండలం గోమారం గ్రామంలో ఆదివారం గ్రామానికి చెందిన ఓ వినాయకుని నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శోభాయాత్ర వీధులలో ఘనంగా సాగుతున్న క్రమంలో ఎమ్మెల్యే సునీత రెడ్డి ఇంటి వద్దకు రాగానే పెద్ద ఎత్తున టపాకులు పేల్చారు.

ఈ క్రమంలో ఎమ్మెల్యే ఇంటి ఆవరణలో టపాసులు పడడంతో ఇంట్లో పడుకున్న ఎమ్మెల్యే అనుచరులు శోభాయాత్రలో ఉన్న కాంగ్రెస్ నాయకులను వారించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో కోపోద్రికులైన కాంగ్రెస్ పార్టీ నాయకులు సునీత రెడ్డి అనుచరుల పై దాడి చేసి చితకబాదారు. ఈ విషయం గ్రామంలో సంచలనంగా మారడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విషయం ఎమ్మెల్యే సునీత రెడ్డికి తెలియడంతో జిల్లా ఎస్పీ, తూప్రాన్ డీఎస్పీలకు జరిగిన విషయం పై ఫిర్యాదు చేశారు.


Similar News