Minister : భవాని మాత ఆశీర్వాదంతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి

రాష్ట్ర ప్రజలకు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.

Update: 2024-10-11 14:38 GMT

దిశ, హుస్నాబాద్: రాష్ట్ర ప్రజలకు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ఈ విజయదశమి జరుపుకుంటామని ప్రతి ఒక్కరు దుర్గా భవాని అమ్మవారి ఆశీర్వాదంతో ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ,సిరిసంపదలతో ఈ సంవత్సరం ప్రారంభించే అన్ని పనుల్లో విజయం సాధించాలని కోరుకున్నారు. దసరా పర్వదినాన శుభసూచకంగా పాలపిట్టను దర్శించి, శమీ వృక్షానికి పూజ చేసి, జమ్మి ఆకును బంగారంగా భావించి పెద్దలకు సమర్పించుకొని ఆశీర్వాదం తీసుకోవడం తెలంగాణలో గొప్ప సంస్కృతి సంప్రదాయానికి నిదర్శమని మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు. ప్రతి ఒక్కరూ పెద్దల ఆశీర్వాదం తీసుకుని భవిష్యత్తులో విజయం సాధించే దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షించారు.


Similar News