గొర్రెల మంద పైకి దూసుకెళ్లిన టిప్పర్ లారీ.. 19 గొర్రె పిల్లలు మృతి

గొర్రెల మంద పైకి టిప్పర్ వాహనం దూసుకెళ్లిన సంఘటన ఆందోల్ మండలం సంగుపెట వద్ద జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది.

Update: 2024-10-23 17:27 GMT

దిశ, ఆందోల్: గొర్రెల మంద పైకి టిప్పర్ వాహనం దూసుకెళ్లిన సంఘటన ఆందోల్ మండలం సంగుపెట వద్ద జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 19 గొర్రె పిల్లలు అక్కడికక్కడే మృతి చెందగా, పలు గొర్రెలకు గాయాలయ్యాయి. సంగుపెట 161 జాతీయ రహదారి మీదుగా జోగిపేట వైపు వస్తున్న గొర్రెల మందపై కి వెనుకాల నుంచి టిప్పర్ లారీ అతివేగంగా వచ్చి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కొన్ని గొర్రెలు నుజ్జు నుజ్జు కాగా మరి కొన్ని కదులుతూ విలవిల కొట్టుకుంటూ అక్కడిక్కడే ప్రాణాలు విడిచాయి. గొర్రెల ఖరీదు సుమారు రూ.80 వేల వరకు ఉంటుందని ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని గొర్రెల కాపర్లు కోరుతున్నారు. విషయం తెలిసిన జోగిపేట ఎస్‌ఐ పాండు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.


Similar News