ఫ్లైఓవర్ పై వేలాడుతున్న బస్సు…తృటిలో తప్పిన ప్రమాదం

జహీరాబాద్ పట్టణంలో భారీ ప్రమాదం తృటిలో తప్పింది. జహీరాబాద్-తాండూర్ వెళ్లే మార్గంలో నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జి పై శివాలయం నుంచి జాతీయ రహదారి వైపు వస్తున్న పిరమిల్ కంపెనీకి చెందిన కార్మికుల బస్సు బ్రిడ్జిపైకి చేరుకోగానే స్టీరింగ్ రాడ్ దెబ్బ తినడంతో బస్సు రేలింకు ని ఢీకొంది.

Update: 2024-09-12 09:10 GMT

దిశ, జహీరాబాద్: జహీరాబాద్ పట్టణంలో భారీ ప్రమాదం తృటిలో తప్పింది. జహీరాబాద్-తాండూర్ వెళ్లే మార్గంలో నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జి పై శివాలయం నుంచి జాతీయ రహదారి వైపు వస్తున్న పిరమిల్ కంపెనీకి చెందిన కార్మికుల బస్సు బ్రిడ్జిపైకి చేరుకోగానే స్టీరింగ్ రాడ్ దెబ్బ తినడంతో బస్సు రేలింకు ని ఢీకొంది.రేలింగ్ గట్టిగా ఉండడంతో బస్సు ఒక చక్రం అదుపు తప్పి కిందకు వేలాడుతూ కనిపించింది. ఈ దృశ్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ దృశ్యాన్ని చూసేందుకు ప్రయాణికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. డ్రైవర్ అప్రమత్తతోనే ప్రమాదం తప్పిందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.


Similar News