వడియారం రైల్వే స్టేషన్ లో గుర్తు తెలియని రెండేండ్ల బాలుడు..

మండల కేంద్రమైన చేగుంటలోని వడియారం రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని రెండు సంవత్సరాల బాలుడిని తల్లిదండ్రులు వదిలి వెళ్లిపోయినట్లు చేగుంట ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి తెలిపారు.

Update: 2024-09-28 15:19 GMT

దిశ, చేగుంట : మండల కేంద్రమైన చేగుంటలోని వడియారం రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని రెండు సంవత్సరాల బాలుడిని తల్లిదండ్రులు వదిలి వెళ్లిపోయినట్లు చేగుంట ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి తెలిపారు. ఈ నెల 26వ తేదీ గురువారం రోజు ఉదయం 11 గంటలకు వడియారం రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాం మీద రెండు సంవత్సరాల వయసు గల బాలుడు ఒంటరిగా ఉన్నాడని సమాచారం రావడంతో రైల్వే స్టేషన్ కు వెళ్ళినట్టు తెలిపారు.

గుర్తుతెలియని రెండు సంవత్సరాల బాలుడి ఆచూకీ కొరకు గురువారం నుండి శనివారం వరకు వేచి చూసినా, అతనికి సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా అతని గురించి రాలేదన్నారు. రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం పై ఒంటరిగా ఉన్న బాలుడుని మెదక్ జిల్లా కేంద్రంలోని చైల్డ్ వెల్ఫేర్ డిస్ట్రిక్ట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సమక్షానికి అప్ప చెప్పినట్లు తెలిపారు. గుర్తుతెలియని బాలుడి ఆచూకీ తెలిసినచో చేగుంట ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి ఫోన్ నంబర్ కు 8712657936 తెలియజేయగలరని కోరారు.


Similar News