కస్తూర్బా పాఠశాలలో 15 మంది విద్యార్థులుకు అస్వస్థత

న్యాల్కల్ మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో

Update: 2024-10-25 07:02 GMT

దిశ,జహీరాబాద్: న్యాల్కల్ మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో చదువుకుంటున్న 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కలుషితమైన నీరు , ఆహారం వల్లే అస్వస్థతకు లోనైనట్లు అనుమానిస్తున్నారు. నిన్న ఇద్దరు విద్యార్థులు అస్వస్థకు గురవ్వగా ఈరోజు 11 మంది బాధపడుతున్నారు. నిన్నటి నుంచి ప్రారంభమైన ఈ సమస్య ఈరోజు తీవ్రమైంది. తుమ్ములు, కడుపు నొప్పి వాంతులతో విద్యార్థులు బాధపడుతున్నారు. వైద్యుల సూచనల మేరకు వెంటనే వారిని జహీరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇక్కడ చికిత్స పొందుతున్న విద్యార్థులు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సంబంధిత జిల్లా అధికారులు ఇందుకు కారణాలను అన్వేషిస్తున్నారు. కాగా తల్లిదండ్రులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని పాఠశాల వర్గాలు పేర్కొంటున్నాయి.


Similar News