వీధి కుక్కల దాడిలో 12 గొర్రెలు మృత్యువాత..

వీధి కుక్కల దాడిలో 12 గొర్రెలు మృత్యువాత పడిన ఘటన గుమ్మడిదల మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

Update: 2024-10-23 06:29 GMT

దిశ, గుమ్మడిదల : వీధి కుక్కల దాడిలో 12 గొర్రెలు మృత్యువాత పడిన ఘటన గుమ్మడిదల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన మేరకు గుమ్మడిదల మండల కేంద్రంలోని కురుమ సంఘం సమీపంలో ఉన్న తూపతి కృష్ణ గొర్లకోటం పై మంగళవారం అర్ధరాత్రి సమయంలో వీధి కుక్కలు తీవ్రంగా దాడి చేశాయి.

ఈ దాడిలో ఏకంగా 12 గొర్రెలు మృత్యువాత పడగా.. మరిన్ని గోర్రెలు తీవ్రంగా గాయాలపాలయ్యాయని అన్నారు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు అనేకం చోటు చేసుకున్నా వీధి కుక్కలను అరికట్టడంలో అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి నష్టపోయిన తిరుపతి కృష్ణకు న్యాయం చేయాలని, అలాగే వీధి కుక్కలను అరికట్టాలని కోరుతున్నారు.


Similar News