కాంగ్రెస్ శ్రేణులకు మహేష్ కుమార్ గౌడ్ కీలక పిలుపు
బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణలపై పెద్దఎత్తున ప్రచారం చేయాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణలపై పెద్దఎత్తున ప్రచారం చేయాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మంగళవారం జూమ్మీటింగ్నిర్వహించారు. ఎంపీ లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, పోటీ చేసిన అభ్యర్థులు, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, విష్ణునాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్కుమార్గౌడ్మాట్లాడారు. గత రెండు రోజులుగా అసెంబ్లీలో బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ బిల్లులను ఆమోదించుకున్నామని తెలిపారు. ఇవి చరిత్రలోనే నిలిచిపోయే ఘట్టాలు అని, స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రంలో కుల గణన జరపలేదన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు, ఎస్సీ వర్గీకరణ కు ఆమోదం తెలుపడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్, చేవెళ్ల డిక్లరేషన్లను ప్రకటించి ఇప్పుడు ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. ఇప్పుడు మనం చేసుకున్న రెండు తీర్మానాలు సామాజిక విప్లవానికి పునాదులు పడ్డాయన్నారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చినపుడు తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడినపుడు ఎంత సంతోషపడ్డమో ఇప్పుడు అంత సంతోషంగా ఉందన్నారు. ఇంత సంతోషాన్ని పల్లెల్లో ఇంటింటికి పంచాలని, పెద్ద ఎత్తున సంబురాలు జరుపాలని, నెల రోజుల పాటు ఈ సంబరాలు నిర్వహించుకోవాలని మహేశ్కుమార్గౌడ్ పిలుపునిచ్చారు. అలాగే ఏఐసీసీ ఆదేశాల మేరకు జైబాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాలను కూడా నిర్వహించాలన్నారు. ఈ అభియాన్ కార్యక్రమాలకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని అందిస్తామన్నారు. ఊరురా బాణాసంచా కాల్చి, ప్లెక్సీలు పెట్టి, ఇంటింటికి కరపత్రాలు పంచాలని, ఊర్లలో పండగలాగా సంబురాలు నిర్వహించుకోవాలన్నారు. అలాగేస్టేజి మీటింగ్ లు, ప్రెస్ మీట్ లు నిర్వహించి, కార్యక్రమాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని సూచించారు.