Delhi: ఒకేచోట కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎంపీలు..

రాష్ట్రపతి భవనంలో శుక్రవారం ఉదయం అల్పాహారం విందు ఏర్పాటు చేశారు.

Update: 2025-03-21 16:25 GMT
Delhi: ఒకేచోట కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎంపీలు..
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రపతి భవనంలో శుక్రవారం ఉదయం అల్పాహారం విందు ఏర్పాటు చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న సందర్భంగా ఆనవాయితీ ప్రకారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభల సభ్యులను ఆహ్వానించి అల్పాహార విందు ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణకు చెందిన ఎంపీలతో కలిసి అల్పాహారం, తేనీరు తీసుకున్నారు.

కేంద్ర మంత్రులు కిషన్​రెడ్డి, బండి సంజయ్‌లతో పాటు ఈటల రాజేందర్, అరవింద్​కమార్, డీకే అరుణ, రఘునందన్​రావు, కొండా విశ్వేశ్వర్​రెడ్డి, గూడెం నాగేశ్, రాజ్యసభ్యులు లక్ష్మణ్, కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్​రెడ్డి, గడ్డం వంశీకృష్ణ, బలరాం నాయక్, అనిల్​కుమార్​యాదవ్, కడియం కావ్య, రామసహయం రాఘురాంరెడ్డి, కుందురు జయవీర్​రెడ్డి, బీఆర్​ఎస్​నుంచి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, కేఆర్ సురేష్ రెడ్డి, దీవకొండ దామోదర్ రావు తదితరులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కలిశారు. అనంతరం రాష్ట్రపతితో ప్రత్యేకంగా భేటీ అయి పలు అంశాలపై చర్చించారు.

Tags:    

Similar News