Mahesh Goud: కౌశిక్‌రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ శ్రేణుల దాడి.. టీపీసీసీ చీఫ్ రియాక్షన్ ఇదే!

ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేయడం పట్ల టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌గౌడ్ స్పందించారు.

Update: 2024-09-12 09:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేయడం పట్ల టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌గౌడ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. రాజకీయాల్లో విమర్శలు, సద్విమర్శలు సర్వ సాధారణమని అన్నారు. ముఖ్యంగా విమర్శలు చేసే సమయంలో భాష చాలా ముఖ్యమని పేర్కొన్నారు. దాడులు, ప్రతిదాడులను ఏ ఒక్కరూ సమర్ధించరని అన్నారు. అయినా, కౌశిక్‌రెడ్డిపై దాడితో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. అరికెపుడి గాంధీ టెక్నికల్‌గా బీఆర్ఎస్ సభ్యుడేనని.. నిబంధనల మేరకే ఆయన పీఏసీ చైర్మన్ అయ్యారని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. 


Similar News