MLA Yennam Srinivas : ఈ జిల్లాలో ప్రభుత్వ 'లా' కాలేజీతో పాటు ఇంజనీరింగ్ కళాశాల

జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీ లో ప్రభుత్వ లా అండ్ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు క్యాబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపినట్లు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్( MLA Yennam Srinivas )రెడ్డి తెలిపారు.

Update: 2024-10-27 12:34 GMT

దిశ ,ప్రతినిధి,మహబూబ్ నగర్: జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీ లో ప్రభుత్వ లా అండ్ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు క్యాబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపినట్లు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్( MLA Yennam Srinivas )రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి,అనిరుద్ రెడ్డి లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ( CM Revanth Reddy ) ఆయన నివాసంలో కలిసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మహబూబ్ నగర్ లో 'ఫస్ట్' కార్యక్రమం చేపట్టి అందులోని 'నవరత్నాలు' గురించి వివరిస్తూ..ప్రభుత్వ కళాశాలల్లో చదివే 200 పేద విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఉచితంగా 'నీట్ అండ్ ఇంజనీరింగ్' ఎంట్రెన్స్ ల కోసం శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని వివరించారు.ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ని అభినందిస్తూ..మహబూబ్ నగర్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా అభివృద్ధి చేయడానికి అన్ని విధాలా సహకరిస్తాననే హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.


Similar News